కాప్రా వెస్ట్రన్ బ్లిస్లో సుమారు రూ. 46 లక్షల వ్యయంతో నిర్మించిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ (యూజీడి) పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ప్రజల ఆరోగ్యానికి, పరిశుభ్రతకు ఎంతో ఉపయోగపడుతుందని, కాలుష్య సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.