వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఎల్లకొండ సమీపంలో ఎత్తిరాజ్పల్లి గ్రామానికి చెందిన బాలమణి(45) అనే మహిళను గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.