TG: తనకు రాజకీయ అభిమానుల కంటే క్రికెట్ అభిమానులే ఎక్కువగా ఉన్నారని మాజీ క్రికెటర్, మంత్రి అజారుద్దీన్ మీడియా ఎదుట తెలిపారు. అయితే భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా అభిమానులను పెంచుకుంటానని చెప్పారు. ప్రజల కోసం కష్టపడి పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా, మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం, సహచర మంత్రులు, పీసీసీకి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.