విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా (302 పరుగులు) నిలిచి, తన ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు. “ఈ సిరీస్లో చాలా ఫ్రీగా ఆడాను. 2–3 ఏళ్లుగా ఇలా ఆడలేదు. మిడిల్ ఓవర్లలో మ్యాచ్ను మార్చే సామర్థ్యం నాలో ఉందని తెలుసు. కొన్నిసార్లు మీపై మీకే సందేహం వస్తుంది. ఒక్క తప్పిదం చాలు ఔట్ కావడానికి. కానీ జట్టుకు మళ్లీ సహాయం చేయగలగడం సంతోషంగా ఉంది. రాంచీ ఇన్నింగ్స్ నాకు స్పెషల్. సిరీస్ 1–1గా ఉన్నప్పుడు రోహిత్తో కలిసి జట్టుకి ప్రత్యేకంగా చేయాలని అనుకున్నాం” అని కోహ్లీ చెప్పాడు.