పాక్ నటి సెలీనా జైట్లీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పాకిస్తాన్ నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతూ ట్రోల్ చేస్తున్నారు. పోస్ట్ డిలీట్ చేయకపోతే అన్ఫాలో చేస్తామని హెచ్చరించారు. తాజాగా దీనిపై నటి సెలీనా స్పందిస్తూ.. ఉగ్రవాదానికి తాను ఎప్పుడూ వ్యతిరేకినేనని. తన భావాలు నచ్చిన వాళ్లు అన్ఫాలో చేయచ్చని క్లారిటీ ఇచ్చారు. ఉగ్రవాదం పేరుతో అమాయకులను చంపితే తాను స్పందించకుండా ఉండనని చెప్పారు. పాక్ వైపు నిలబడనని పేర్కొన్నారు.