ఐసీసీ వార్షిక టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా 131 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా 119 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. భారత్ 104 పాయింట్లతో ఒక స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకుంది. గతంలో మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ నాలుగో స్థానానికి, న్యూజిలాండ్ ఐదో స్థానానికి పడిపోయాయి.