జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపుతో కాంగ్రెస్ కు ఇచ్చిన హామీలు మళ్లీ గుర్తుకు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎల్లారెడ్డిగూడ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో కరెంటు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇచ్చిందని, బీఆర్ఎస్ ను గెలిపించి కాంగ్రెస్ కు హామీలు గుర్తు చేయాలని ఆయన కోరారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సునీతను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.