భారత పార్లమెంటులో ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాట పాడారు. తానే గనుక సకాలంలో జోక్యం చేసుకోకపోతే భారత్- పాక్ యుద్ధంలో ఉండేవని వ్యాఖ్యానించారు. స్కాట్లాండ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేనే లేకుంటే.. ఆరు పెద్ద యుద్ధాలు జరగుతుండేవి. భారత్- పాక్ యుద్ధం చేసుకోవాలనుకుంటే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనని చెప్పాను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.