ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా అరగొండ గ్రామంలోని అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న సంజీవరాయ పుష్కరిణి నీటికి దివ్య ఔషధ గుణాలున్నాయని భక్తులు విశ్వసిస్తున్నారు. రామాయణ కాలంలో హనుమంతుడు సంజీవని తెస్తుండగా పర్వతంలో సగభాగం విరిగిపడిన ప్రాంతమే అర్ధగిరి. ఈ కోనేటి నీటిని 40 రోజుల పాటు సేవిస్తే టి.బి., ఆస్తమా, కీళ్ల నొప్పులు వంటి వ్యాధులు నయమవుతాయని ప్రసిద్ధి. స్వామిని దర్శిస్తే వ్యాధులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.