హైదరాబాద్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మాసబ్ చెరువులో వినాయక నిమజ్జన సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హస్తినపురానికి చెందిన గిరిజ కుటుంబ సభ్యులు వినాయకుడితో పాటు సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు గొలుసును పొరపాటున నిమజ్జనం చేసారు. తర్వాత గుర్తించి అధికారులకు తెలియజేయగా, జేసీబీ సహాయంతో విగ్రహాన్ని బయటకు తీసి, మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసును కుటుంబానికి తిరిగి అప్పగించారు.