గుజరాత్లోని మెహసానాలో భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఎయిరోబాటిక్ టీమ్ (SKAT) నిర్వహించిన గగనతల విన్యాసాలు వేలాది మందిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. తొమ్మిది హాక్ ఎంకే 132 జెట్లు చేసిన సాహసోపేతమైన విన్యాసాలు, సమన్వయంతో అతి దగ్గరగా దూసుకెళ్తూ ఆకాశంలో రింగులు తిరగడం, త్రివర్ణ పొగలు వదలడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో గుజరాత్ మంత్రి రుషికేశ్ పటేల్, పార్లమెంట్ సభ్యుడు హరి పటేల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.