ఇందౌర్లో భారత్–న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో కివీస్ జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ ఆదిలోనే ఓపెనర్లు కాన్వే (5), హెన్రీ (0) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత విల్ యంగ్ (30) కూడా ఔటయ్యాడు. అయితే డారిల్ మిచెల్ (79), గ్లెన్ ఫిలిప్స్ (44) క్రీజులో నిలదొక్కుకుని భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. 53 బంతుల్లో గ్లెన్ ఫిలిప్స్ హాఫ్ సెంచరీ చేశాడు. 30 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 159/3గా ఉంది.