IND vs NZ: భారత్ తొలి వికెట్ను కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ (26) ఔటై పెవిలియన్కు చేరాడు. కట్టుదిట్టంగా ఆడుతున్న రోహిత్ను కివీస్ బౌలర్ జేమీసన్ అవుట్ చేశాడు. జేమీసన్ వేసిన బంతిని షాట్కు ప్రయత్నించిన హిట్మ్యాన్, బ్రేస్వెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ తొలి వికెట్ను కోల్పోయింది. ఈ వికెట్తో న్యూజిలాండ్ బౌలర్లలో ఉత్సాహం కనిపిస్తోంది.