ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండగా, పాక్ మతతత్వం, ఉగ్రవాదంలో మునిగిపోయిందని అన్నారు. పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను కాల్చి చంపారని హరీష్ గుర్తు చేశారు. భారత్ 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిందని తెలిపారు.