భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి తీరాలని భారత్ పట్టుదలగా ఉంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా జట్టులోని కీలక బ్యాటర్లు ఫామ్లోకి రావాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.