ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. పాక్ ఇచ్చిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో సూర్య కుమార్ 47*, అభిషేక్ శర్మ 31, తిలక్ వర్మ 31 పరుగులతో రాణించారు. తొలుత భారత బౌలర్ల దెబ్బకు పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 127/9 పరుగులకే పరిమితం అయింది.