మూడు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కివీస్ నిర్దేశించిన 301 లక్ష్యాన్ని భారత్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. విరాట్ కోహ్లీ(93)కి సెంచరీ, శ్రేయస్(49) అర్ధశతకం మిస్సయింది. కెప్టెన్ గిల్(56) హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్కే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో జెమిసెన్ 4, ఆదిత్య అశోక్, క్లార్క్ చెరో వికెట్ తీశారు.