విమానాల రద్దు నేపథ్యంలో, ఇండిగో సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు తెలియజేస్తూ, కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 5 నుంచి 15వ తేదీ మధ్య ఉన్న తమ ప్రయాణ బుకింగ్లు రద్దయినా, రీషెడ్యూల్ అయినా, ప్రయాణికులకు పూర్తి డబ్బు రీఫండ్ చెల్లిస్తామని ఇండిగో సంస్థ ప్రకటించింది. రద్దయిన బుకింగ్లకు సంబంధించిన డబ్బులు ప్రయాణికులకు ఆటోమేటిక్గా రీఫండ్ అవుతాయని ఇండిగో స్పష్టం చేసింది.