మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత మహిళలతో జరిగిన ఆఖరి టీ20లో ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. 181 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అలిస్ క్యాప్సీ (82), హీథర్ నైట్ (70*) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 2, అరుంధతీ రెడ్డి, నందని శర్మ ఒక్కో వికెట్ తీశారు.