AP: నంద్యాల జిల్లా డోన్ బీసీ బాలుర కళాశాల వసతి గృహంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం బాత్రూమ్కి వెళ్లిన విద్యార్థి (16) టెలిఫోన్ వైర్తో ఉరేసుకున్నాడు. తోటి విద్యార్థులు గమనించి హాస్టల్ వార్డెన్, పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.