TG: మహబూబాబాద్ జిల్లా గడ్డి గూడెం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రసాద్, రష్మితలు భార్యాభర్తలు. ఆరు నెలల క్రితం రష్మితకు ఇన్స్టాగ్రామ్లో అనిల్ అనే యువకుడు పరిచయం కాగా అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త అడ్డు తొలగించుకోవాలనుకోని ఆదివారం అర్ధరాత్రి ప్రియుడితో కలిసి ప్రసాద్ పై కత్తితో దాడి చేశారు. ఈ క్రమంలో ప్రసాద్ చెవికి, ఛాతీకి గాయాలయ్యాయి. ప్రసాద్ కేకలు విని వచ్చిన స్థానికులు అనిల్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.