క్రికెట్ అభిమానులు ఐపీఎల్ను ఎంతలా ఇష్టపడతారో తెలిసిందే. తమ అభిమాన జట్టు గెలవాలని ప్రాణం పెట్టి కోరుకుంటారు. తమ జట్టును విమర్శించినా, ట్రోల్ చేసినా తట్టుకోలేరు. నిన్న ఆర్సీబీ కప్ కొట్టిన సందర్భంలో ఓ పబ్లో తీవ్ర ఘర్షణకు దారితీసింది. RCB జట్టుపై ఎవరో చేసిన చిన్న విమర్శతో వివాదం మొదలైంది. దీంతో మాటామాట పెరిగి రెండు వర్గాల
క్రికెట్ అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలియాల్సి ఉంది.