బిహార్ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను రాజ్యసభకు పంపే యోచనలో జేడీయూ పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, కేంద్ర కేబినెట్లో నితీష్ కుమార్కు చోటు కల్పించే అవకాశం ఉందని, అదే సమయంలో బీజేపీకి బిహార్ సీఎం పీఠం దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.