తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి అజారుద్దీన్ పీసీసీకి ధన్యవాదాలు తెలిపారు. ముస్లింల ఓట్ల కోసమే మంత్రి పదవి ఇచ్చారనేది అవాస్తవమని, తొలి నుంచి మైనారిటీలకు సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని, రాజకీయాల్లో క్లీన్బోల్డ్ ఉండదని, ఆడుకుంటూ వెళ్లాలని ఆయన అన్నారు. కెప్టెన్ తాను కాదని, తమ ముఖ్యమంత్రి అని తెలిపారు.