ఐటీ రిటర్నులను దాఖలు చేసేందుకు ఇచ్చే గడువును ఈసారి జులై 31 నుంచి సెప్టెంబరు 15 వరకు పొడిగించారు. ఇప్పటికే 1.16 కోట్ల రిటర్నులు దాఖలు కాగా.. 1.09 కోట్ల ఐటీఆర్లు వెరిఫై కూడా అయ్యాయి. ఐటీ రిఫండ్ జారీ గడువు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. 2013లో 93 రోజులుగా ఉన్న ఈ గడువు.. ప్రస్తుతం 17 రోజులకు తగ్గింది. రిటర్నుల్లో ఏవైనా అనుమానాలుంటే అదనపు డాక్యుమెంట్లు కోరుతోంది. దీనివల్ల ఈసారి రిఫండ్ల ప్రక్రియ ఆలస్యం అవుతోంది.