ఏఐ విప్లవం కారణంగా డేటా కేంద్రాలకు డిమాండ్ పెరగడంతో శామ్సంగ్ చిప్ విభాగం భారీ వృద్ధిని సాధించింది. గత త్రైమాసికంలో ఆదాయం 49 రెట్లు పెరగడంతో, 78 వేల మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఉద్యోగులు ఇటీవల చేపట్టిన సమ్మె బెదిరింపులు కూడా ఈ బోనస్కు కారణమని తెలుస్తోంది. సమ్మె జరిగితే కంపెనీకి కోట్లలో నష్టం వాటిల్లుతుందని, సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడుతుందని భావించి, ఉద్యోగుల సంఘంతో ఒప్పందం కుదుర్చుకుంది.