జగిత్యాల జిల్లా లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ అడువాల జ్యోతి బుధవారం ఎన్నికయ్యారు. సమాజ సేవలో సుదీర్ఘ అనుభవం కలిగిన జ్యోతి బాధ్యతలు చేపట్టడంతో క్లబ్ కార్యకలాపాలకు కొత్త దిశను తీసుకువస్తుందని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రతినిధులు, నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.