గజనీ మహమ్మద్ చేత ధ్వంసం చేయబడిన సోమనాథ్ ఆలయం 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, జగిత్యాల శివ వీధిలోని శివాలయంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలోశనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సోమనాథ్ ఆలయం భారతీయ సనాతన ధార్మికతకు చిహ్నమని, గజనీ మహమ్మద్ పలుమార్లు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.