
త్వరలో అమరావతి-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రారంభం
త్వరలో అమరావతి-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ బుల్లెట్ ట్రైన్ అమరావతి నుంచి హైదరాబాద్కి 70 నిమిషాల్లో, అమరావతి నుంచి చెన్నైకి 112 నిమిషాల్లో చేరుకుంటుందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దక్షిణాది రాష్ట్రాలకు NDA ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.




