రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, జగిత్యాల జిల్లాకు సాధారణ ఎన్నికల పరిశీలకులుగా ఖర్టాడే కాళీచరణ్ సుదామ రావు నియమితులయ్యారు. గురువారం జగిత్యాలలోని అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆయనను కలిసి పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం, 5 మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య, ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు వంటి అంశాలపై చర్చించారు.