గురువారం జగిత్యాల పర్యటనలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పార్టీలో చేరమని ఆహ్వానించడానికి ఆయన ఇంటికి వెళ్లినప్పుడు కార్యకర్తల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కవరేజీకి వెళ్లిన క్యూ న్యూస్ రిపోర్టర్ వాకొడే సాయి కుమార్ కాలు విరిగింది. మరికొందరు జర్నలిస్టులు కూడా గాయపడ్డారు మరియు పలువురి కెమెరాలు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటన కేటీఆర్ పర్యటనలో అపశృతిగా మారింది.