జగిత్యాల ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణలో భాగంగా మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో డీఎస్పీలు వెంకటరమణ, రఘు చందర్, డాక్టర్ దీపిక, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు.