జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ మదన వేణుగోపాల రుక్మిణి సమేత స్వామి ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో, శ్రీమాన్ నంబి నరసింహా చిన్న కౌశిక స్వామి పర్యవేక్షణలో లోక కళ్యాణార్థం 9 రోజుల పాటు హోమ యఙ్గయాగాదులు కొనసాగుతాయని నరసింహా చిన్న స్వామి తెలిపారు. శుక్రవారం శ్రీ లక్ష్మీ సంపుటికరణ హావనం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు పాల్గొన్నారు.