రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు, జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం దరూర్ క్యాంప్ లోని ఈవీఎం గోదామును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, ప్రతి నెలా ఈవీఎం లను తనిఖీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల పర్యవేక్షకులు, మరియు కలెక్టరేట్ ఏవో హకీమ్ పాల్గొన్నారు.