జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం కారణంగా గణనీయమైన నష్టం జరిగింది. జగిత్యాల రూరల్, అర్బన్ మండలాల్లోని అనేక గ్రామాలలో మొక్కజొన్న పంట నేలకొరిగిపోగా, మామిడి కాయలు రాలిపోయాయి. జిల్లాలోని ఇతర మండలాల్లో కూడా అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధికారులు నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.