హైదరాబాద్లోని అల్వాల్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాచర్ల పవన్ కుమార్ (40) హత్య కేసులో, మల్యాల మండలం బల్వంతాపూర్ శివారులోని ఆశ్రమంలో పెట్రోలు పోసి నిప్పంటించి చంపిన ఆరుగురు నిందితులకు జిల్లా అదనపు సెషన్స్ జడ్జి నారాయణ జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి ₹10,000 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో శిక్ష పడటంలో కృషి చేసిన పోలీసులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.