జగిత్యాల గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధిలో బుధవారం పట్టణ సీఐ కరుణాకర్ కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్న సీఐ కరుణాకర్ పేరిట ఆలయ పూజారి అర్చన చేసి ఆశీర్వదించారు. ఆలయ పక్షాన సీఐని పూజారి ఘనంగా సన్మానించారు.