
నేటితో ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులకు నెల
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో మొదలైన ఘర్షణ నేటితో నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు అధికారులు మరణించినట్లు భావించినా, ఇరాన్ తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లు, క్షిపణులతో ఎదురుదాడి చేస్తూ గల్ఫ్ దేశాలను, ప్రపంచ ఇంధన సరఫరాను ప్రభావితం చేస్తోంది. ఈ యుద్ధం 16 దేశాలకు విస్తరించగా, ఇరాన్ బాధ్యతలను ఖమేనీ కుమారుడు మొజ్తబా చేపట్టారు. ఇరాన్ ఆర్థిక వెన్నుముక అయిన ‘సౌత్ పార్స్’ గ్యాస్ ఫీల్డ్ను ఇజ్రాయెల్ దెబ్బతీయడంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ప్రస్తుతం ఏప్రిల్ 6 వరకు దాడులకు ట్రంప్ విరామం ఇచ్చారు.




