నల్లగొండ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న ఐ20 కారు సుందరగిరి-కొండాపూర్ శివారులో ప్రమాదానికి గురైంది. అతివేగం, రోడ్డుపై ఉన్న ఇసుక కారణంగా కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. అయితే, కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.