మెట్పల్లి మండలంలోని వెంపేట్ గ్రామంలో ఈ నెల 22న ఈత వనాన్ని దుండగులు తగలబెట్టారు. ఈ ఘటనపై కల్లుగీత కార్మికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై కిరణ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితులతో మాట్లాడి విచారణ చేపట్టారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.