ఐక్యరాజ్యసమితి (UNGA) 80వ సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్తాన్ను 'ప్రపంచ ఉగ్రవాదానికి నిలయం' అని అభివర్ణించారు. దశాబ్దాలుగా అంతర్జాతీయ ఉగ్రవాద దాడుల వెనుక పాకిస్తాన్ ఉందని, జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ దాడి దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం తమ ప్రాధాన్యత అని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జైశంకర్ హెచ్చరించారు.