బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. బుధవారం అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న ఆమె, గురువారం ఉదయం నటి మహేశ్వరితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. జాన్వీ కపూర్ తిరుమల పర్యటనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.