నేడు ఢిల్లీ హైకోర్టులో నటుడు జూనియర్
ఎన్టీఆర్ దాఖలు చేసిన కేసు విచారణ జరగనుంది. తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా సోషల్ మీడియా, ఈ-కామర్స్ వెబ్సైట్లలో తన పేరు, ఫోటోలు, వీడియోలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని
ఎన్టీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ చర్యలు తన ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. ఈ కేసును నేడు జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం విచారించనుంది.