స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వృత్తి పట్ల నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. ఒక కమర్షియల్ యాడ్ షూట్ సందర్భంగా ఆయన గాయపడిన విషయం తెలిసిందే. వైద్యులు విశ్రాంతి సూచించినా, నిర్మాతలకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో మరుసటి రోజే షూటింగ్లో పాల్గొని యాడ్ను పూర్తి చేశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో జరిగిన ఈ షూటింగ్లో ఆయన చూపిన ప్రొఫెషనలిజం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు.