ముంబై చెంబూర్లోని కాళీమాత ఆలయంలో కలకలం రేగింది. సాధారణంగా కాళీమాత రూపంలో ఉండే విగ్రహం, మేరీ మాత అలంకరణతో దర్శనమివ్వడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటోలు వైరల్ కావడంతో విషయం బయటపడింది. భక్తులు ప్రశ్నించగా, పూజారి రమేష్ తనకు కలలో కాళీమాత దర్శనమిచ్చి ఇలా అలంకరించమన్నారని చెప్పాడు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రమేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది.