కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో సోమవారం
కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శాసనసభ్యులు మదన్ మోహన్ రావు, డిసిసి అధ్యక్షులు ఏలె మల్లికార్జున్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీతో స్వాగతం పలికి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవం
కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.