బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గీతా జయంతి, మోక్షద ఏకాదశి సందర్భంగా భగవద్గీత పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. కంకణాల అరవింద్ స్వామి మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని కాపాడాలంటే భగవద్గీత మార్గాన్ని అందరూ పాటించాలని, ప్రతి ఒక్కరికీ భగవద్గీత పుస్తకాన్ని ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.