బాన్సువాడ పట్టణంలో ఆర్టీసీ బస్సులు పరిమితికి మించి ఓవర్ లోడుతో ప్రయాణికులను, విద్యార్థులను తరలిస్తున్నాయి. సాయంకాలం వేళల్లో అదనపు బస్సులు వేయాలని ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే డిపో అధికారులు స్పందించి అదనపు బస్సులు నడపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.