జుక్కల్ సెగ్మెంట్ నిజాంసాగర్ మండలంలోని మాగి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో 2025-26 సంవత్సరంలో 4 లక్షల 25 వేల మెట్రిక్ టన్నుల చెరుకును గానుగ ఆడించే లక్ష్యంతో సోమవారం చెరకు క్రషింగ్ ను ప్రారంభించారు. వైస్ ప్రెసిడెంట్ టీ. వేణుగోపాలరావు, జనరల్ మేనేజర్ వెంగల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ ప్రక్రియను మొదలుపెట్టారు.