మంగళవారం కామారెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి ధనసూరి అనసూయ (సీతక్క), అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశారు. ప్రతి గ్రామానికి నిరంతరాయంగా తాగునీటి సరఫరా, సాగునీటి అవసరాలు సమయానికి తీర్చాలని అధికారులకు సూచించారు. కామారెడ్డి జిల్లాలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.